ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్  చిత్రం సంక్రాంతి విడుదల కాకపోవడం జూన్ లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా చిత్ర బృందం రంగం సిద్ధం చేయడం అభిమానులను నిరాశపరిచిన అయన సినిమా కిశోరం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తామని చెబుతున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే ఈలోపు తాను చేస్తున్న చిన్న సినిమా ను విడుదల చేయాలనీ అంటున్నారు. వాస్తవానికి ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది అన్ని ప్రభాస్ సినిమాలలా కాకుండా చిన్న సినిమా అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానుల నుంచి డిమాండ్ ఏర్పడుతుంది. మారుతి తొందరగానే సినిమాను పూర్తి చేసే విధంగా పని చేస్తాడు. ఆయన గత సినిమాలు కూడా ఎక్కువ రోజులు షూటింగ్ దశలో లేవు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గనుక డేట్ లు కేటాయిస్తే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed