సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా సరే విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా ఆ సెలబ్రిటీలను మరింత పాపులారిటీ చేస్తూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో చాలామంది ఆచితూచి తమ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది సెలబ్రిటీల విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందనే చెప్పాలి. వారు ఎలాంటి ఫోటోలు షేర్ చేయకపోయినా సరే వారు ఎందుకు ఫోటో షేర్ చేయలేదు అనే అనుమానాలకు కూడా తెర లేపుతూ ఉంటారు నేటిజన్స్.
ఇకపోతే హీరో హీరోయిన్లు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా ట్రోల్స్ కి గురవుతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే వివాహమైతే చాలు వెంటనే తల్లి అయ్యింది అంటూ రకరకాల వార్తలు రాసేస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న రానా భార్య మిహికా బజాజ్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాశారు.. ఈ విషయంపై మిహికా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం ఇంకా సద్దుమనగకనే ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ హీరో, టాలీవుడ్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి భార్య నిక్కీ గర్లాని తల్లి కాబోతోంది అంటూ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా ఈ వార్తలు నిక్కీ వరకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ ఇలా స్పందించింది. “నేను ప్రెగ్నెంట్ అన్న వార్తలను కొంతమంది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి” అంటూ ఒక నవ్వుతున్న ఏమోజీ నీ షేర్ చేసింది. “నేను ప్రెగ్నెంట్ కాదు..దీన్ని భవిష్యత్తులో తప్పకుండా బ్రేక్ చేస్తా.. దయచేసి రూమర్లు నమ్మకండి” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది నిక్కీ..
కృష్ణాష్టమి, మలుపు తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ.. నటుడు ఆది పినిశెట్టిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది మేలో ఒకటయ్యి మరింత పాపులారిటీని తగ్గించుకున్నారు. మొత్తానికైతే నిక్కీ ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.
— Nikkii Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022