బాలకృష్ణ సంక్రాంతి కానుకగా వీర సింహ రెడ్డి సినిమా ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మాస్ మసాలా సినిమా గా రాబోతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న బాలకృష్ణ ఆ తర్వాత ఆదిత్య 999 సినిమా చేయబోతున్నాడు. అనే వార్తలు వస్తున్నాయి.

ఆదిత్య 369 సీక్వెల్ అంటే అంతకు మించి అన్నట్లుగా ఉంటేనే అభిమానులు ఒప్పుకుంటారు. కనుక బాలయ్య వీఎఫ్ఎక్స్ విషయంలో కాస్త ఎక్కువ హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. అయన ఇప్పటివరకు హెవీ గ్రాఫిక్స్ పనులున్నా సినిమా చేయలేదు. అలా ఈ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కనుక కొన్ని షాట్స్ అయినా వీఎఫ్ఎక్స్ కీలకంగా ఉంటాయి.

వాటిని బాలయ్య ఎలా డిజైన్ చేస్తాడు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. బాహుబలి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆ స్థాయి గ్రాఫిక్స్ కోరుకుంటున్నారు.

-Ramesh Reddy Chilakala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *