గీత గోవిందం సినిమా తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్ ఏకంగా మహేష్ బాబు తో సినిమా ఛాన్స్ అందుకోవడం విశేషం. అలా సర్కార్ వారి పాట సినిమా చేసిన తర్వాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తాడా అన్న ఆసక్తి అందరిలో నెలకొనగా మొన్నటిదాకా ఈ దర్శకుడు నాగచైతన్య తో సినిమా చేస్తాడని అందరు అనుకున్నారు.

కానీ తాజాగా బాలకృష్ణ తో అయన సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం గీతా ఆర్ట్స్. ఆ నిర్మాణ సంస్థ తో పరశురామ్ కి చాలా సాన్నిహిత్యం ఉంది. రెండు సినిమాలు చేయడంతో అల్లు అరవింద్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇటు బాలయ్యతో గీతా ఆర్ట్స్ వారికి మంచి అనుబంధం ఉంది. ఇటీవలే అల్లు హీరో అల్లు శిరీష్ సినిమా వేడుక కి బాలకృష్ణ అతిధి గా వచ్చాడు.

దాంతో అల్లు వారికి, బాలకృష్ణ మంచి అనుబంధం ఏర్పడడం వలన ఈ ప్రాజెక్టు సెట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరశంకర్ రెడ్డి’ సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఈ సినిమా ఉండబోతుందన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed