విజయ్ దళపతి హీరో గా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి వారసుడు అనే టైటిల్ ను నిర్ణయించారు. ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని అందరు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. లుక్స్ బాగానే ఉన్నా కూడా పాత కథల లాగానే సినిమా ఉందని చెబుతున్నారు. వంశీ కెరీర్ లో పెద్దగా ప్రయోగాలు చేసింది ఏమి లేదు. ఎంత డిఫరెంట్ కథ తీసుకున్నా కూడా అదే పాత మసాలా కలిపేస్తుంటాడు అనే విమర్శ ఉంది.

మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ తరుణంలో వంశీ ఇది పూర్తిగా తమిళ సినిమా అని అనడంతో మహర్షిని రీమేక్ చేసినట్లు ఉన్నారని తెలుగు నెటిజన్లు తమిళం ఆడియెన్స్ కు మండేలా ట్రోల్ మొదలెట్టేశారు. ఇక దిల్ రాజు ఇది కరెక్ట్ కాదని వంశీ పై కాస్త గరమైనట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య సోదర భావం ఉండడంతో కాస్త గట్టిగా వాదించుకున్న సందర్బాలు ఉన్నాయట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed