కన్నడ స్టార్ హీరో యష్ ఇకపై తన సినిమాల స్పీడ్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 తర్వాత ఏడాదిన్నకు పైగా టైమ్ తీసుకున్న ఈ స్టార్ హీరో ..ఇకపై త్వరగా సినిమాలు చేసేయాలని ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీ నుంచి, ఫ్యాన్స్ నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇటీవల తన కొత్త సినిమా వర్క్స్ స్టార్ట్ చేశాడు యష్. తన 19వ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.

ఈ సినిమాను ఆర్నెళ్లలో కంప్లీట్ చేసిన కేజీఎఫ్ 3కి రెడీ కాబోతున్నాడట యష్. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది చివరలో బిగిన్ చేయాలని అనుకుంటున్నారట. ఈలోగా గీతా మోహన్ దాస్ సినిమా ఫినిష్ చేయబోతున్నాడు యష్. నెక్ట్ ఇయర్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్ కల్లా ఆ సినిమా పూర్తి చేస్తారు.

దీంతో వీళ్లిద్దరు కేజీఎఫ్ 3 పనులు మొదలుపెట్టాలనుకుంటున్నారని సమాచారం. కేజీఎఫ్ 3 ని వీలైనంత త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తామని అటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కూడా సందర్భం వచ్చినప్పుడు చెబుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *