తనపై వస్తున్న రూమర్స్ పై మరోసారి ఘాటుగా స్పందించింది సమంత. మీడియా కథనాలకు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతుంటుందీ తార. తాజాగా తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి చికిత్స గురించి వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యింది. సమంత ఇన్ స్టా స్టోరీస్ ద్వారా స్పందించింది.

ఇన్ స్టా స్టోరీస్ లో సమంత పోస్ట్ చూస్తే…మయోసైటిస్ వ్యాధితో వేలాది మంది బాధపడుతున్నారు. నేనొక్కరినే కాదు. ఈ వ్యాధి చికిత్స కోసం 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనేది అవాస్తవం. మీరు చెప్పే దాంట్లో చాలా చాలా చిన్న అమౌంట్ తో మయోసైటిస్ వ్యాధి నయం చేయించుకోవచ్చు. అయినా నేను పనిచేసే సినిమాలకు పెంకాసులేం తీసుకోవడం లేదు. నా దగ్గర డబ్బుంది. నా గురించి నేను చూసుకోగలను. నా గురించి ఆలోచిస్తున్నందుకు మీకు థాంక్స్. నా గురించి నా వ్యాధి చికిత్స గురించి కథనాలు రాసేప్పుడు బాధ్యతగా ఉండండి ప్లీజ్ . అంటూ పేర్కొంది. ఇటీవల బాలి టూర్ వెళ్లిన సమంత..అక్కడ తన స్నేహితురాలితో కలిసి చిల్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed