వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ రావడంతో వైఎస్సార్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.
ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు కర్రసాము చేస్తూ కిందపడ్డారు. ర్యాలీలో కర్రసాము చేస్తున్న క్రమంలో కర్ర కాలికి తగిలి ఎమ్మెల్యే కిందపడిపోయారు.

వెంటనే అక్కడున్నవారంతా ఎమ్మెల్యేను పైకిలేపారు. అప్పటి వరకు కర్రసాములో మా ఎమ్మెల్యే మొనగాడు అనుకున్న అనుచరులు… కిందపడగానే అయ్యోయ్యో అంటూ ఎమ్మెల్యేను పైకిలేపి తీసుకెళ్లారు.
దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఎమ్మెల్యేకు ఏమైనా దెబ్బ తగిలిందా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *