ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలు విడుదల లు ఇప్పుడు మారుతున్నాయని చెప్పవచ్చు. ఆయన హీరోగా నటించిన ఆది పురుష్ చిత్రం వాయిదా పడడంతో ఆయన తరువాత చేయబోయే సినిమాల యొక్క విడుదలలు మారుతున్నాయని చెప్పవచ్చు. ఇది ప్రభాస్ అభిమానులను ఎంతో కలవరపెట్టే విషయం అనే చెప్పాలి. వాస్తవానికి సంక్రాంతికి ఆది పురుష్ చిత్రం విడుదల అయి ఉంటే తప్పకుండా ఆయన సినిమాల విడుదలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేవి.
కానీ ఆ సినిమా యొక్క అవుట్ పుట్ పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేని ప్రభాస్ ఈ చిత్రాన్ని మరొకసారి సరిగ్గా గ్రాఫిక్స్ చేయాలి అని భావించి దర్శక నిర్మాతలకు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసే విధంగా సూచనలు చేశాడట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం జరగదు అని భావించి వచ్చే ఏడాది వేసవికి మార్చారట. అయితే అప్పటికే షెడ్యూల్ అయి ఉన్న ప్రభాస్ ఇతర సినిమాలు విడుదలలు ఆటోమేటిగ్గా వాయిదా పడుతున్నాయని చెప్పవచ్చు.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాలు ఈ విధంగా వాయిదా పడడం నిజంగా అందరిని నిరాశ పరిచే విషయం అనే చెప్పాలి. మరి అభిమానులను సంతోష పెట్టడానికి ప్రభాస్ ఏదైనా సినిమాను ముందుకు తీసుకువచ్చి దానిని వెంటనే విడుదల చేస్తాడా అనేది చూడాలి. మారుతి దర్శకత్వంలో ఒక చిన్న సినిమాను చేస్తున్న ప్రభాస్ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది అనేది చాలా మంది ప్రభాస్ అభిమానుల కోరిక.
ఇంకా మొదలు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకుంటే మాత్రం ఇది సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆలోచన ప్రభాస్ చేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం ఒకవైపు ప్రాజెక్టు కే సినిమాను ఇంకొక వైపు సలార్ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు.