ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తదుపరి భాగం పట్ల అభిమానులలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం గ్రాఫిక్స్ పనులు ఎంతో అద్భుతంగా ఉండడంతో రెండవ భాగం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అని చెబుతున్నారు.

ఆ సినిమాలో హీరోగా నటించేది ఎవరో అని అభిమానులలో అంచనాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. మొదటి భాగంలో హీరోగా నటించిన విడుదల చేసి ప్రేక్షకులను అలరించాడు అన్నదానిపై అంతట చర్చ జరుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ రెండవ భాగంలో నటించబోయే హీరో విజయ్ దేవరకొండ అని చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాత అయిన కరణ్ జోహార్ తో మంచి అనుబంధం ఉంది విజయ్ దేవరకొండకు.

ఆయన గత సినిమా లైగర్ కి కూడా నిర్మాత గా ఆయన చేశారు. అయితే ఈ సినిమాలో కూడా నటించమని కరణ్ విజయ్ దేవరకొండ ను అడగడం జరిగిందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే కనుక విజయ్ దేవరకొండ మంచి సినిమాను ఎంచుకున్నట్లే అని చెప్పాలి.

ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమాను చేయడం అంటే ఏ హీరో కైనా మంచి విషయమే. తొందరలోనే దీనిపై ఒక క్లారిటీ రావాలని నేను అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఖుషి సినిమాను చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. వాళ్లు ఆయన ఎవరితో ముందుకు వెళతారో చూడాలి. గౌతమ్ తిననూరి తో ఒక భారీ ఇండియా ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకొక వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక మాస్ మసాలా సినిమాను చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *