ప్రెజెంట్ బుల్లితెరలో ఎప్పుడెప్పుడా అని వీక్ అంత ఎదురు చూసే ప్రోగ్రామ్స్ లో ఒకటైన జబర్దస్త్ లో ఇప్పుడు అనసూయ ప్లేస్ ని రష్మీ కి కాకుండా కొత్తగా వచ్చిన తమిళ నటి ఐనా సౌమ్య కి యాంకరింగ్ బాధ్యతలు ఇచ్చారు. ఈ గురువారమే న్యూ యాంకర్ ఐనా సౌమ్య జబర్దస్త్ షో లో గ్రాండ్ గా స్వామి స్వామి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. మరి న్యూ యాంకర్ ని చూసి మన కమెడియన్స్ ఊరికే వదులుతారా తమ తమ స్టయిల్ లో వారం దరు సౌమ్య ని ఆటపట్టించారు.

హైపర్ అది అయితే ఏకంగా పంచ్ డైలాగ్తో సెటైర్ వేసాడు సౌమ్య అయితేనేమి మా చేతిలో సేమ్యా అవ్వాల్సిందే అని అన్నాడు.ఇదిలావుంటే ఒక వైపు జడ్జి గా ఉన్న కృష్ణ భగవాన్ కూడా సౌమ్య మీద బాగానే సెటర్స్ వేస్తూ కామెడీచేసారు. ఐతే సౌమ్య మాత్రం వాళ్ళ నుండి కాపాడుకోవడానికి తనకు తాను బాగా ప్రయత్నం చేసింది.

అసలు విషయానికి వస్తే సౌమ్య జబర్దస్త్ లోకి రావడానికి మల్లెమాలే కారణం అని అంటుంది యాంకర్ రష్మీ. అనసూయ కొంచం బిజీ షెడ్యూల్స్ వలన రాలేకపోతె ఎక్సట్రా జబర్దస్త్ కూడా తననే చేయమని చెప్పారు. గతంలో ఎప్పుడైనా అనసూయ మిస్ ఐతే చేసేదాన్ని కానీ రెండు షో లు చేయడం నాకు కొద్దిగా కష్టం అనిపించింది. అందుకే ఈ గురువారం జబర్దస్త్ కి రావడం లేదు అని రష్మీ అంది. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి నేనే వస్తాను అంది రష్మీ.ఈ విధంగా నేను రాను అని అంటే సౌమ్య అనే న్యూ యాంకర్ జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వ వలిసి వచ్చింది అని రష్మీ చెప్పుకొచ్చారు.

చివరికి ఏదైతేనేమి న్యూ యాంకర్ తో షో లో సందడి సందడి గా షో ముగిసింది. సౌమ్య కొత్త యాంకర్ ఐనా చాలా బాగా చేసిందని జబర్దస్త్ అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *