వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు.  బాబీ దర్శకత్వంలో మాస్ మసాలా సినిమాగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాను మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించాడు.
ఇటు నందమూరి బాలకృష్ణ కూడా వీర సింహా రెడ్డి సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని చాలా రోజులుగా భావిస్తూ వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని ఇప్పటికే వచ్చిన అప్డేట్లను బట్టి చెప్పవచ్చు. ఇక ఈ రెండు సినిమాల్లో మాత్రమే కాకుండా సంక్రాంతికి మరో మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed