లైగర్ సినిమా తర్వాత ఖుషి సినిమా చేయబోతున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఎవరితో సినిమా చేయాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. ఖుషి సమంత కథానాయికగా కనిపించనున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడని చెబుతున్నారు.నిన్నటి దాకా హరీష్ శంకర్ సినిమా చేయడానికి విజయ్ తెగ ప్రయత్నాలు చేశాడు.

అయితే తాజాగా త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు. అయితే కథను ఇవ్వడానికి తాను రెడీ అని త్రివిక్రమ్ అంటే, ఆయనే డైరెక్షన్ కూడా చేయాలని విజయ్ దేవరకొండ పట్టుబడుతున్నాడట. మరి త్రివిక్రమ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం మహేశ్ మూవీతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన ఖాళీ గా ఉన్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed