ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమా తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న మణిరత్నం ఇప్పుడు తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ అందుకున్న విజువల్ క్లాసిక్ గా పొన్నియన్ సెల్వన్ ను తమిళ జనం మాములుగా ఆదరించలేదు. ఈ సినిమా కు తెలుగుతో సహా ఇతర వెర్షన్లు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోయినా మణిరత్నం టేకింగ్, విజువల్స్, కలర్ఫుల్ క్యాస్టింగ్ పుణ్యమాని మరీ దారుణంగా దెబ్బ తినకుండా గట్టెక్కింది.

ఇప్పుడు ఈ సినిమా యొక్క రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న మణిరత్నం త్వరలోనే రజినీకాంత్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా దళపతి. ఆ తర్వాత వీరు కలిసి పని చేయలేదు. ముప్పై ఏళ్ల తర్వాత వీరు మళ్ళీ కలిసి పనిచేయడం విశేషం. పొన్నియన్ సెల్వన్ 2 తాలూకు పనులు మొత్తం పూర్తయ్యి 2023 వేసవిలో రిలీజ్ చేశాక రజనితో తో మణిరత్నం సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. ఇది రజిని అభిమానులను ఎంతో సంతోషపెట్టే విషయం అనే చెప్పాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *